హజ్ తొక్కిసలాట: యాత్రీకులకు యూఏఈ భరోసా
- September 25, 2015
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఏఈ అధికారిక హజ్ మిషన్ ప్రతినిథులతో టెలిఫోన్లో సంభాషించారు. హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట గురించి ఆరా తీసిన షేక్ మహ్మద్, యూఏఈ యాత్రీకులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. ఇస్లామిక్ అఫైర్స్ మరియు ఎండోమెంట్స్ జనరల్ అథారిటీ ఛైర్మన్, యూఏఈ హజ్ మిషన్ అధికారి డాక్టర్ మొహమ్మద్ మతార్ అల్ కాబి మాట్లాడుతూ, షేక్ మహ్మద్ హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై కలత చెందారనీ, యూఏఈ యాత్రీకుల భద్రతపై ఆయన ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నారనీ, యూఏఈ యాత్రీకుల క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థన కూడా చేశారనీ, మృతుల అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారనీ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందించమని షేక్ మహ్మద్ చెప్పారన్నారు కాబీ. తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి చాలా దూరంగానే యూఏఈ యాత్రీకులు చాలావరకు ఉన్నారనీ, వారికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గురువారం వార్షిక హజ్ యాత్ర సందర్భంగా మీనాలో జరిగిన తొక్కిసలాటలో 717 మంది మృత్యువాత పడిన విషయం తెలిసినదే.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









