పారిపోయిన జంట అరెస్ట్
- March 23, 2017మనామా: 55,000 బహ్రెయినీ దినార్స్ మొతాన్ని కాజేసి పారిపోయిన ఓ జంటను అదుపులోకి తీసుకున్నారు. బహ్రెయిన్లోని పలు కంపెనీలను ఈ జంట మోసం చేసినట్లు అభియోగాలున్నాయి. ఇండియాకి చెందిన ఈ జంట, బహ్రెయిన్లో పలు కంపెనీలను మోసం చేసి, ఇండియాకి పారిపోగా, ఇండియన్ అథారిటీస్ ఈ జంటను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు అబ్దుల్ హకీమ్ అతని భార్య నసీమా బివి భారతదేశంలోఇన కేరళ రాష్ట్రంలో అరెస్టయ్యారు. ఈ జంట కారణంగా మోసానికి గురైన మొహమ్మద్ జలాల్ అండ్ సన్స్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. సదరు కంపెనీ నుంచి వేలాది దినార్ల విలువైన ఖరీదైన సిగరెట్స్ని కొనుగోలు చేశారు. వాటిని ఇతరులకు అమ్మి తద్వారా వచ్చిన సొమ్ముతో స్వదేశానికి పారిపోయారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









