పారిపోయిన జంట అరెస్ట్‌

- March 23, 2017 , by Maagulf
పారిపోయిన జంట అరెస్ట్‌

మనామా: 55,000 బహ్రెయినీ దినార్స్‌ మొతాన్ని కాజేసి పారిపోయిన ఓ జంటను అదుపులోకి తీసుకున్నారు. బహ్రెయిన్‌లోని పలు కంపెనీలను ఈ జంట మోసం చేసినట్లు అభియోగాలున్నాయి. ఇండియాకి చెందిన ఈ జంట, బహ్రెయిన్‌లో పలు కంపెనీలను మోసం చేసి, ఇండియాకి పారిపోగా, ఇండియన్‌ అథారిటీస్‌ ఈ జంటను అరెస్ట్‌ చేయడం జరిగింది. నిందితులు అబ్దుల్‌ హకీమ్‌ అతని భార్య నసీమా బివి భారతదేశంలోఇన కేరళ రాష్ట్రంలో అరెస్టయ్యారు. ఈ జంట కారణంగా మోసానికి గురైన మొహమ్మద్‌ జలాల్‌ అండ్‌ సన్స్‌ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వీరిని అరెస్ట్‌ చేయడం జరిగింది. సదరు కంపెనీ నుంచి వేలాది దినార్ల విలువైన ఖరీదైన సిగరెట్స్‌ని కొనుగోలు చేశారు. వాటిని ఇతరులకు అమ్మి తద్వారా వచ్చిన సొమ్ముతో స్వదేశానికి పారిపోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com