కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- March 23, 2017
కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. 2017 నుంచి 2019 వరకు కొనసాగనున్న ఈ కొత్తపాలసీలో వైన్షాపు లైసెన్స్ ఫీజులు భారీగా తగ్గించింది. 4,380 వైన్షాపులకు లైసెన్స్లు ఇవ్వాలని నిర్ణయించిన సర్కారు, లాటరీ పద్ధతిలో వైన్ షాపుల కేటాయించబోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలు, మండల కేంద్రాల్లో వైన్షాపులు ఏర్పాటు చేయబోతున్నారు. 5 వేల జనాభా వరకు రూ.7.50 లక్షలు, 5-10 వేల జనాభా వరకు రూ.8.50 లక్షలు, 10-25 వేల జనాభా వరకు రూ.9.25 లక్షలు, 25-50 వేల జనాభా వరకు రూ.10 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల వరకు రూ.11.25 లక్షలు, 3-5 లక్షల జనాభా వరకు రూ.12.50 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉన్న నగరాల్లో రూ.16.25 లక్షలు ఫీజుగా వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







