ఐపీఎల్-10 సీజన్ విక్రయానికి హైదరాబాద్ ఐపీఎల్ టిక్కెట్లు
- March 24, 2017
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐపీఎల్-10 సీజన్ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ముంబయి, బెంగళూరు తదితర జట్లు సొంతగడ్డపై జరిగే మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనూ అభిమానుల కోసం టిక్కెట్ల పంపిణీ మొదలు పెట్టేశారు. స్టేడియంతో పాటు ఎంపిక చేసిన కొన్ని దుకాణాల్లో టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రారంభ వేడుకలకు సంబంధించిన టిక్కెట్లను మాత్రం ఇప్పటి వరకూ ఏ జట్టు అందుబాటులోకి తీసుకురాలేదు. హైదరాబాద్లో జరిగే 7 మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం మార్చి 25 నుంచి సొంతగడ్డపై జరిగే మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 4న ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఉప్పల్ మైదానంలో జరగనున్నాయి. తర్వాతి రోజు ఉప్పల్ మైదానంలో జరిగే తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







