మరణశిక్ష నుంచి 10 మంది భారతీయులకు ఉపశమనం లభిస్తుందా?
- March 26, 2017
అల్ అయిన్ జైల్లో ఉన్న పది మంది భారతీయ యువకులు మరణశిక్ష నుంచి ఉపశమనం పొందుతారా? అని వారి బంధువులు ఎదురుచూస్తున్నారు. ఓ పాకిస్తానీ వ్యక్తిని హత్య చేసిన కేసులో మొత్తం 11 మంది నిందులు కాగా, అందులో ఒకరికి మరణశిక్ష నుంచి మినహాయించారు. మిగతా 10 మందికి మరణ శిక్ష పడగా, మృతుడి తండ్రి నుంచి వారికి క్షమాభిక్ష లభించింది. 'నా కొడుక్కి జరిగినట్లే వారికీ జరగాలని కోరుకోవడంలేదు. నా కుటుంబం చాలా నష్టపోయింది, అలాగే వారి కుటుంబాలు నష్టపోకూడదని కోరుకుంటున్నాను' అని మృతుడు మొహమ్మద్ ఫర్హాన్ తండ్రి చెప్పారు. దాంతో, ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి 'బ్లడ్ మనీ'ని ఇప్పటికే కోర్టులో డిపాజిట్ చేయడం జరిగిందని అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ - కమ్యూనిటీ ఎఫైర్స్ దినేష్ కుమార్ చెప్పారు. ఏప్రిల్ 12న ఈ కేసు హియరింగ్కి రానుంది. 'బ్లడ్ మనీ'ని సర్బత్ దా బాలా ఛారిటబుల్ ట్రస్ట్ చెల్లించిందని సంస్థ ఛైర్మన్ ఎస్పిఎస్ ఒబెరాయ్ చెప్పారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









