విజయానికి గుర్తుగా 'వైగై ఎక్స్‌ప్రెస్‌' తపాలాబిళ్ల విడుదల

- March 27, 2017 , by Maagulf
విజయానికి గుర్తుగా 'వైగై ఎక్స్‌ప్రెస్‌' తపాలాబిళ్ల విడుదల

నటుడు, నిర్మాత ఆర్‌కే స్వీయ నిర్మాణంలో హీరోగా నటించిన 'వైగై ఎక్స్‌ప్రెస్‌' గత శుక్రవారం విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు షాజి కైలాస్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పంపిణీలో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన ఆర్‌కే ఇప్పుడు ప్రచారాన్నీ కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తున్నారు. 'వైగై ఎక్స్‌ప్రెస్‌' విజయానికి గుర్తుగా ఈ సినిమా పోస్టర్‌తో ఒక తపాలాబిళ్లను విడుదల చేశారు. తద్వారా ఇప్పటివరకు ఏ చిత్రానికీ దక్కని ఘనతను 'వైగై ఎక్స్‌ప్రెస్‌' దక్కించుకుంది. తపాలాబిళ్లను చెన్నైలో శనివారం విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌కే, హీరోయిన్ నీతూ చంద్ర, ఇతర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com