షార్జాలో జోరందుకున్న 'గల్ఫీ' ప్రమోషన్
- April 13, 2017
గల్ఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా షార్జా లో ని ఇండస్ట్రియల్ ఏరియా 17 లో గల్ఫీ కాంటెస్ట్ నిర్వహించటం జరిగింది. షార్జా ఏరియా ప్రమోషనల్ అంబాసిడర్ రాజేష్ వేమూరి అక్కడి కాంపుల్లో ఉన్న తెలుగు వారితో సినిమా విశేషాలు పంచుకున్నారు. గల్ఫ్ లో కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలు ,వారు ఇక్కడికి రావటానికి ప్రేరేపించిన ఇండియాలో పరిస్థితుల మీద చర్చిస్తూ ఈ సినిమా రూపొందుతోంది. పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.గతంలో శ్రీ సునీల్ కుమార్ రెడ్డి పలు సామాజిక ఇతివృత్తాల ని కధాంశంగా చేసుకుని చిత్రాలని రూపొందించారు. మత్స్య కారుల పోరాటం మీద తీసిన గంగపుత్రులు సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డులు గెలుచుకుంది. అలాగే తెలంగాణ నుండి వలస వచ్చిన గల్ఫ్ కార్మికుల వ్యధ ని ఇతివృత్తంగా చేసుకుని , మంచి ఆశయంతో రూపొందిన గల్ఫ్ సినిమా ని విజయవంతం చేయాలని ఇక్కడి తెలుగు వారికి రాజేష్ వేమూరి విజ్ఞప్తి చేశారు.


తాజా వార్తలు
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్









