షార్జాలో జోరందుకున్న 'గల్ఫీ' ప్రమోషన్
- April 13, 2017గల్ఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా షార్జా లో ని ఇండస్ట్రియల్ ఏరియా 17 లో గల్ఫీ కాంటెస్ట్ నిర్వహించటం జరిగింది. షార్జా ఏరియా ప్రమోషనల్ అంబాసిడర్ రాజేష్ వేమూరి అక్కడి కాంపుల్లో ఉన్న తెలుగు వారితో సినిమా విశేషాలు పంచుకున్నారు. గల్ఫ్ లో కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలు ,వారు ఇక్కడికి రావటానికి ప్రేరేపించిన ఇండియాలో పరిస్థితుల మీద చర్చిస్తూ ఈ సినిమా రూపొందుతోంది. పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.గతంలో శ్రీ సునీల్ కుమార్ రెడ్డి పలు సామాజిక ఇతివృత్తాల ని కధాంశంగా చేసుకుని చిత్రాలని రూపొందించారు. మత్స్య కారుల పోరాటం మీద తీసిన గంగపుత్రులు సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డులు గెలుచుకుంది. అలాగే తెలంగాణ నుండి వలస వచ్చిన గల్ఫ్ కార్మికుల వ్యధ ని ఇతివృత్తంగా చేసుకుని , మంచి ఆశయంతో రూపొందిన గల్ఫ్ సినిమా ని విజయవంతం చేయాలని ఇక్కడి తెలుగు వారికి రాజేష్ వేమూరి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..