షార్జాలో జోరందుకున్న 'గల్ఫీ' ప్రమోషన్
- April 13, 2017గల్ఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా షార్జా లో ని ఇండస్ట్రియల్ ఏరియా 17 లో గల్ఫీ కాంటెస్ట్ నిర్వహించటం జరిగింది. షార్జా ఏరియా ప్రమోషనల్ అంబాసిడర్ రాజేష్ వేమూరి అక్కడి కాంపుల్లో ఉన్న తెలుగు వారితో సినిమా విశేషాలు పంచుకున్నారు. గల్ఫ్ లో కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలు ,వారు ఇక్కడికి రావటానికి ప్రేరేపించిన ఇండియాలో పరిస్థితుల మీద చర్చిస్తూ ఈ సినిమా రూపొందుతోంది. పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.గతంలో శ్రీ సునీల్ కుమార్ రెడ్డి పలు సామాజిక ఇతివృత్తాల ని కధాంశంగా చేసుకుని చిత్రాలని రూపొందించారు. మత్స్య కారుల పోరాటం మీద తీసిన గంగపుత్రులు సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డులు గెలుచుకుంది. అలాగే తెలంగాణ నుండి వలస వచ్చిన గల్ఫ్ కార్మికుల వ్యధ ని ఇతివృత్తంగా చేసుకుని , మంచి ఆశయంతో రూపొందిన గల్ఫ్ సినిమా ని విజయవంతం చేయాలని ఇక్కడి తెలుగు వారికి రాజేష్ వేమూరి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!