క్షమాభిక్షతో సంతోషంగా ఇండియాకి పయనం
- April 14, 2017
జెడ్డా: క్షమాభిక్ష దొరుకుతుందా? లేదా? అన్న టెన్షన్ నడుమ జీవితం కష్టంగా సాగిందనీ, క్షమాభిక్ష రావడంతో సంతోషంగా ఇండియాకి వెళుతున్నానని మానికం అర్ముగం అన్నారు. కాలుని కోల్పోయిన తర్వాత తన జీవితం దుర్భరంగా మారిందనీ, ఈ పరిస్థితుల్లో తాను ఇండియాకి తిరిగి వెళ్ళగలనని అనుకోలదని, ఆశ కోల్పోయిన దశలో తనకు క్షమాభిక్ష ఓ వరంలా కనిపించిందని చెమర్చిన కళ్ళతో అర్ముగం చెప్పారు. తమిళనాడులోని తంజావూరుకి చెందిన అర్ముగమ్, సెట్రల్ వెజిటబుల్ మార్కెట్లో పోర్టర్గా పనిచేశారు. స్పాన్సరర్ నుంచి ఎస్కేప్ అయి, జెడ్డాలోని ఫ్యూయల్ స్టేషన్లో కొన్నాళ్ళు ఆర్ముగం పనిచేశాడు. ఓ రోజు దురదృష్టవశాత్తూ వేగంగా దూసుకొచ్చిన కారు అతన్ని ఢీకొనడంతో, ఆయన తన కాలుని కోల్పోయాడు. జెడ్డా తమిళ సంఘం, సెంతమిల్ నాలా మంద్రమ్ సహా పలు సంస్థలు అతనికి సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. తమిళనాడులో అతనికి తగిన ఆర్థిక సహాయం అందిస్తామని కమ్యూనిటీ వర్కర్స్ సహెర్ పాండియన్, మొహమ్మద్ సిరాజ్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







