క్షమాభిక్షతో సంతోషంగా ఇండియాకి పయనం
- April 14, 2017
జెడ్డా: క్షమాభిక్ష దొరుకుతుందా? లేదా? అన్న టెన్షన్ నడుమ జీవితం కష్టంగా సాగిందనీ, క్షమాభిక్ష రావడంతో సంతోషంగా ఇండియాకి వెళుతున్నానని మానికం అర్ముగం అన్నారు. కాలుని కోల్పోయిన తర్వాత తన జీవితం దుర్భరంగా మారిందనీ, ఈ పరిస్థితుల్లో తాను ఇండియాకి తిరిగి వెళ్ళగలనని అనుకోలదని, ఆశ కోల్పోయిన దశలో తనకు క్షమాభిక్ష ఓ వరంలా కనిపించిందని చెమర్చిన కళ్ళతో అర్ముగం చెప్పారు. తమిళనాడులోని తంజావూరుకి చెందిన అర్ముగమ్, సెట్రల్ వెజిటబుల్ మార్కెట్లో పోర్టర్గా పనిచేశారు. స్పాన్సరర్ నుంచి ఎస్కేప్ అయి, జెడ్డాలోని ఫ్యూయల్ స్టేషన్లో కొన్నాళ్ళు ఆర్ముగం పనిచేశాడు. ఓ రోజు దురదృష్టవశాత్తూ వేగంగా దూసుకొచ్చిన కారు అతన్ని ఢీకొనడంతో, ఆయన తన కాలుని కోల్పోయాడు. జెడ్డా తమిళ సంఘం, సెంతమిల్ నాలా మంద్రమ్ సహా పలు సంస్థలు అతనికి సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. తమిళనాడులో అతనికి తగిన ఆర్థిక సహాయం అందిస్తామని కమ్యూనిటీ వర్కర్స్ సహెర్ పాండియన్, మొహమ్మద్ సిరాజ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







