క్షమాభిక్షతో సంతోషంగా ఇండియాకి పయనం
- April 14, 2017
జెడ్డా: క్షమాభిక్ష దొరుకుతుందా? లేదా? అన్న టెన్షన్ నడుమ జీవితం కష్టంగా సాగిందనీ, క్షమాభిక్ష రావడంతో సంతోషంగా ఇండియాకి వెళుతున్నానని మానికం అర్ముగం అన్నారు. కాలుని కోల్పోయిన తర్వాత తన జీవితం దుర్భరంగా మారిందనీ, ఈ పరిస్థితుల్లో తాను ఇండియాకి తిరిగి వెళ్ళగలనని అనుకోలదని, ఆశ కోల్పోయిన దశలో తనకు క్షమాభిక్ష ఓ వరంలా కనిపించిందని చెమర్చిన కళ్ళతో అర్ముగం చెప్పారు. తమిళనాడులోని తంజావూరుకి చెందిన అర్ముగమ్, సెట్రల్ వెజిటబుల్ మార్కెట్లో పోర్టర్గా పనిచేశారు. స్పాన్సరర్ నుంచి ఎస్కేప్ అయి, జెడ్డాలోని ఫ్యూయల్ స్టేషన్లో కొన్నాళ్ళు ఆర్ముగం పనిచేశాడు. ఓ రోజు దురదృష్టవశాత్తూ వేగంగా దూసుకొచ్చిన కారు అతన్ని ఢీకొనడంతో, ఆయన తన కాలుని కోల్పోయాడు. జెడ్డా తమిళ సంఘం, సెంతమిల్ నాలా మంద్రమ్ సహా పలు సంస్థలు అతనికి సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. తమిళనాడులో అతనికి తగిన ఆర్థిక సహాయం అందిస్తామని కమ్యూనిటీ వర్కర్స్ సహెర్ పాండియన్, మొహమ్మద్ సిరాజ్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









