క్షమాభిక్షతో సంతోషంగా ఇండియాకి పయనం
- April 14, 2017
జెడ్డా: క్షమాభిక్ష దొరుకుతుందా? లేదా? అన్న టెన్షన్ నడుమ జీవితం కష్టంగా సాగిందనీ, క్షమాభిక్ష రావడంతో సంతోషంగా ఇండియాకి వెళుతున్నానని మానికం అర్ముగం అన్నారు. కాలుని కోల్పోయిన తర్వాత తన జీవితం దుర్భరంగా మారిందనీ, ఈ పరిస్థితుల్లో తాను ఇండియాకి తిరిగి వెళ్ళగలనని అనుకోలదని, ఆశ కోల్పోయిన దశలో తనకు క్షమాభిక్ష ఓ వరంలా కనిపించిందని చెమర్చిన కళ్ళతో అర్ముగం చెప్పారు. తమిళనాడులోని తంజావూరుకి చెందిన అర్ముగమ్, సెట్రల్ వెజిటబుల్ మార్కెట్లో పోర్టర్గా పనిచేశారు. స్పాన్సరర్ నుంచి ఎస్కేప్ అయి, జెడ్డాలోని ఫ్యూయల్ స్టేషన్లో కొన్నాళ్ళు ఆర్ముగం పనిచేశాడు. ఓ రోజు దురదృష్టవశాత్తూ వేగంగా దూసుకొచ్చిన కారు అతన్ని ఢీకొనడంతో, ఆయన తన కాలుని కోల్పోయాడు. జెడ్డా తమిళ సంఘం, సెంతమిల్ నాలా మంద్రమ్ సహా పలు సంస్థలు అతనికి సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. తమిళనాడులో అతనికి తగిన ఆర్థిక సహాయం అందిస్తామని కమ్యూనిటీ వర్కర్స్ సహెర్ పాండియన్, మొహమ్మద్ సిరాజ్ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







