ఒమాన్ లో రోడ్డు మాదం: ఐదుగురి మృతి
- October 02, 2015
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఒమన్ దేశస్తులు మృతి చెందారు. ప్రమాద స్థలంలోనే ఐదుగురు వ్యక్తులు మృతి చెందినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఇబ్రిలోని ముక్నియా వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వాహనం దగ్ధమైందనీ, నలుగురు సజీవ దహనం కాగా, ఇంకొకరు వాహనంలోంచి విసిరివేయబడ్డారనీ, ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అతి వేగంతో ఓవర్టేక్ చేయబోయిన వాహనం ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఇబ్రి హాస్పిటల్లో నలుగురి మృత దేహాల్ని భద్రపరిచారు. మరొకరి మృతదేహం హజర్మఠ్ ఆసుపత్రిలో భద్రపరిచారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









