పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో 'దండుపాళ్యం 2'
- May 17, 2017శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన ‘దండుపాళ్య’ చిత్రం కన్నడలో విజయం సాధించి, రూ. 30 కోట్లు వసూళ్లు చేసింది. ‘దండుపాళ్యం’ పేరుతో తెలుగులో విడుదలైన ఇదే చిత్రం తెలుగులోనూ విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా ‘దండుపాళ్యం 2’ చిత్రాన్ని నిర్మాత వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి షూటింగ్ పూర్తైంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘దర్శకుడు శ్రీనివాసరాజు చిత్రాన్ని చాలా బాగా తీశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. షూటింగ్ పూర్తైంది. ‘దండుపాళ్యం’ను మించి ‘దండుపాళ్యం 2’ తెలుగు, కన్నడ భాషల్లో మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ మకరంద్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!