పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో 'దండుపాళ్యం 2'
- May 17, 2017
శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన ‘దండుపాళ్య’ చిత్రం కన్నడలో విజయం సాధించి, రూ. 30 కోట్లు వసూళ్లు చేసింది. ‘దండుపాళ్యం’ పేరుతో తెలుగులో విడుదలైన ఇదే చిత్రం తెలుగులోనూ విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా ‘దండుపాళ్యం 2’ చిత్రాన్ని నిర్మాత వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి షూటింగ్ పూర్తైంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘దర్శకుడు శ్రీనివాసరాజు చిత్రాన్ని చాలా బాగా తీశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. షూటింగ్ పూర్తైంది. ‘దండుపాళ్యం’ను మించి ‘దండుపాళ్యం 2’ తెలుగు, కన్నడ భాషల్లో మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ మకరంద్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









