పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో 'దండుపాళ్యం 2'
- May 17, 2017
శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన ‘దండుపాళ్య’ చిత్రం కన్నడలో విజయం సాధించి, రూ. 30 కోట్లు వసూళ్లు చేసింది. ‘దండుపాళ్యం’ పేరుతో తెలుగులో విడుదలైన ఇదే చిత్రం తెలుగులోనూ విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా ‘దండుపాళ్యం 2’ చిత్రాన్ని నిర్మాత వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి షూటింగ్ పూర్తైంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘దర్శకుడు శ్రీనివాసరాజు చిత్రాన్ని చాలా బాగా తీశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. షూటింగ్ పూర్తైంది. ‘దండుపాళ్యం’ను మించి ‘దండుపాళ్యం 2’ తెలుగు, కన్నడ భాషల్లో మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ మకరంద్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









