పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో 'దండుపాళ్యం 2'

- May 17, 2017 , by Maagulf
పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో 'దండుపాళ్యం 2'

శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన ‘దండుపాళ్య’ చిత్రం కన్నడలో విజయం సాధించి, రూ. 30 కోట్లు వసూళ్లు చేసింది. ‘దండుపాళ్యం’ పేరుతో తెలుగులో విడుదలైన ఇదే చిత్రం తెలుగులోనూ విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం 2’ చిత్రాన్ని నిర్మాత వెంకట్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి షూటింగ్‌ పూర్తైంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘దర్శకుడు శ్రీనివాసరాజు చిత్రాన్ని చాలా బాగా తీశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. షూటింగ్‌ పూర్తైంది. ‘దండుపాళ్యం’ను మించి ‘దండుపాళ్యం 2’ తెలుగు, కన్నడ భాషల్లో మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ మకరంద్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com