సౌదీ అరేబియా లో కార్మికుల సమస్యల పై స్పందించిన ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి
- May 31, 2017
సౌదీ అరేబియా లో ఆంధ్రప్రదేశ్ కు సంభందించిన 8 మంది కార్మికుల సమస్యల పై సోషల్ మీడియా లో వచ్చిన వీడియోల ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్.ఆర్.ఐ మంత్రివర్యులు వెంటనే స్పందించి అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్.ఆర్.ఐ జాయింట్ సెక్రటరీ అశోక్ బాబు సౌదీలోని భారతీయ దౌత్య కార్యాలయానికి కార్మికుల వివరాలు తెలిపారు.అక్కడ సంభందిత అధికారులను వెంటనే తగిన సహాయ సహకారాలను అందించాలని కోరారు.మన తెలుగు వారు త్వరగా భారత్ దేశం తిరిగి రావాలని ఆశిద్దాం.ఈ సమస్యను శ్రీకాంత్ చిత్తర్వు (యు.ఏ.ఈ ఏ.పి.ఎన్.ఆర్.టి కో-ఆర్డినేటర్) మరియు రాధా కృష్ణ రవి ( సౌదీ అరేబియా ఏ.పి.ఎన్.ఆర్.టి కో-ఆర్డినేటర్) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









