సౌదీ అరేబియా లో కార్మికుల సమస్యల పై స్పందించిన ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి

- May 31, 2017 , by Maagulf
సౌదీ అరేబియా లో కార్మికుల సమస్యల పై స్పందించిన ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి

సౌదీ అరేబియా లో ఆంధ్రప్రదేశ్ కు సంభందించిన 8 మంది కార్మికుల సమస్యల పై సోషల్ మీడియా లో వచ్చిన వీడియోల ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్.ఆర్.ఐ మంత్రివర్యులు వెంటనే స్పందించి అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్.ఆర్.ఐ జాయింట్ సెక్రటరీ అశోక్ బాబు సౌదీలోని భారతీయ దౌత్య కార్యాలయానికి కార్మికుల వివరాలు తెలిపారు.అక్కడ సంభందిత అధికారులను వెంటనే తగిన సహాయ సహకారాలను అందించాలని కోరారు.మన తెలుగు వారు త్వరగా భారత్ దేశం తిరిగి రావాలని ఆశిద్దాం.ఈ సమస్యను శ్రీకాంత్ చిత్తర్వు (యు.ఏ.ఈ ఏ.పి.ఎన్.ఆర్.టి కో-ఆర్డినేటర్) మరియు రాధా కృష్ణ రవి ( సౌదీ అరేబియా ఏ.పి.ఎన్.ఆర్.టి కో-ఆర్డినేటర్) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com