అమ్నెస్టీ: కింగ్డమ్ని వీడిన 345,000 మంది వలసదారులు
- June 05, 2017
సౌదీ అరేబియా:గడచిన రెండు నెలల్లో అమ్నెస్టీ ద్వారా లాభపడి, దేశాన్ని వీడిన వలసదారుల సంఖ్య 34,000కి పైగానే ఉందని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 345,089 మంది ఇప్పటిదాకా దేశాన్ని వీడారు అమ్నెస్టీతో. ఈ విషయాన్ని పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ దైఫల్లా బిన్ సట్టామ్ అల్ హువైఫి చెప్పారు. 90 రోజుల అమ్నెస్టీని ఇంటీరియర్ మినిస్ట్రీ మార్చి 29న ప్రారంభించింది. ఎలాంటి పెనాల్టీలు లేకుండా అమ్నెస్టీ సమయంలో వలసదారులు దేశం విడిచి వెళ్ళేందుకు అవకాశముంది. వివిధ ఉల్లంఘనలతో ఇబ్బందులుపడుతున్న ఎంతోమందికి అమ్నెస్టీ ఊరటగా నిలిచింది. దేశం నుంచి అక్రమ వలసదారుల్ని బయటకు పంపించేందుకుగాను అమ్నెస్టీని ప్రకటించడం జరిగింది. అమ్నెస్టీ తర్వాత కూడా ఉల్లంఘనులు దేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







