అమ్నెస్టీ: కింగ్‌డమ్‌ని వీడిన 345,000 మంది వలసదారులు

- June 05, 2017 , by Maagulf
అమ్నెస్టీ: కింగ్‌డమ్‌ని వీడిన 345,000 మంది వలసదారులు

 సౌదీ అరేబియా:గడచిన రెండు నెలల్లో అమ్నెస్టీ ద్వారా లాభపడి, దేశాన్ని వీడిన వలసదారుల సంఖ్య 34,000కి పైగానే ఉందని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 345,089 మంది ఇప్పటిదాకా దేశాన్ని వీడారు అమ్నెస్టీతో. ఈ విషయాన్ని పాస్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ దైఫల్లా బిన్‌ సట్టామ్‌ అల్‌ హువైఫి చెప్పారు. 90 రోజుల అమ్నెస్టీని ఇంటీరియర్‌ మినిస్ట్రీ మార్చి 29న ప్రారంభించింది. ఎలాంటి పెనాల్టీలు లేకుండా అమ్నెస్టీ సమయంలో వలసదారులు దేశం విడిచి వెళ్ళేందుకు అవకాశముంది. వివిధ ఉల్లంఘనలతో ఇబ్బందులుపడుతున్న ఎంతోమందికి అమ్నెస్టీ ఊరటగా నిలిచింది. దేశం నుంచి అక్రమ వలసదారుల్ని బయటకు పంపించేందుకుగాను అమ్నెస్టీని ప్రకటించడం జరిగింది. అమ్నెస్టీ తర్వాత కూడా ఉల్లంఘనులు దేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com