కళాకారులను ఘనంగా సత్కరించిన 'కళానిలయం'
- June 06, 2017
ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ 'కళానిలయం' త్రితీయ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి. నవీముంబై వాషీలోని విష్ణుదాసు భావే ఆడిటోరియం లో 'ముంబై జబర్దస్త్' పేరిట నిర్వహించిన ఈ వేడుకల్లో హైదరాబాద్ కు చెందిన సినీ, టీవీ రంగాలకు చెందిన పలువురు కళాకారులు ఆడి, పాడి కార్యక్రామాన్ని రక్తి కట్టించారు. కళానిలయం చైర్ పర్సన్ పి.సుజాతరావు, హైదరాబాద్ కు చెందిన సుదీప అతిథులు, ప్రేక్షకులకు స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారి హర్షిత కూచిపూడి నృత్యం, 'సోల్ టు సోల్ డాన్స్ అకాడమీ' ప్రదర్శించిన గ్రూప్ డాన్స్, సినీ నేపధ్య గాయని మానసా ఆచార్య, రఘురామ్ పాటలు, జబర్దస్త్ బృందం రచ్చ రవి, ఆడి కిరణ్ ఆట పాటలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అనంతరం వివిధ రంగాలలోని ప్రముఖుల్ని కళానిలయం తొలిసారిగా ప్రవేశపెట్టిన 'కళానిలయం' అవార్డును ప్రదానం చేశారు. అవార్డు అందుకున్నవారిలో ప్రముఖ రచయత సిరాశ్రీ (సాహిత్య సుధా), దర్శకుడు రామ్ భీమన (విశిష్ట ప్రతిభ), నటి సుభాషిణి (కళారత్న), కూచిపూడి నాట్య కళాకారిణి శైలజా దేశాయ్ (కళానిధి), ప్రముఖ బహుభాషా వ్యాఖ్యాత టి.చలపతిరావు (కళాకోవిద), ప్రముఖ నాట్య కళాకారిణి మేరీ మ్యాక్ మోహన్ పాల్ ను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో కళానిలయం నిర్వాహకులు పాటి బండ్ల సుధాకరరావు, కమిటీ సభ్యులతోపాటు నగరంలోని ప్రముఖులు, తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.




తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









