త్వరలోనే ఏరియర్స్ చెల్లింపు
- June 11, 2017
బహ్రెయిన్లో కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ జీతాల్ని త్వరలోనే చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ హుమైదాన్ చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సూచనల మేరకు ఈ ప్రక్రియలో వేగం పెంచారు. ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్స్తో, మినిస్ట్రీ తీసుకున్న చర్యలు ఫలించి కన్స్ట్రక్షన్ కంపెనీ తమ కార్మికులకు పాత బకాయిల్ని చెల్లించాలని నిర్ణయించినట్లు మినిస్టర్ చెప్పారు. తమ జీతాల కోసం వంద మందికి పైగా కార్మికులు ఎస్తిక్లాల్ హైవే మీద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన అందరినీ ఆలోచింపజేసింది. బహ్రెయిన్లో ప్రముఖ లేబర్ యూనియన్ అయిన జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ (జిఎఫ్బిటియు) ఈ ఆందోళన విషయంలో కార్మికుల తరఫున నిలబడింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









