'మమ్మల్నీ అమ్నెస్టీ ద్వారా రక్షించండి'-బహ్రెయిన్

- October 12, 2015 , by Maagulf
'మమ్మల్నీ అమ్నెస్టీ ద్వారా రక్షించండి'-బహ్రెయిన్

తమను కూడా అమ్నెస్టీ ద్వారా రక్షించాలనీ, న్యాయ సహాయం అందించాలని కోరుతూ పలువరు అమ్నెస్టీని సంప్రదిస్తున్నారు. బహ్రెయిన్‌లో వర్క్‌ పెర్మిట్‌ వీసాపై వచ్చి, గడువు ముగిసిన తర్వాత కూడా దేశం విడిచి వెళ్ళకుండా, దేశంలోనే అక్రమంగా నివసిస్తున్నవారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఇలాంటివారికి సహాయం అందించేందకు అమ్నెస్టీ ప్రయత్నిస్తోంది. ఈ అమ్నెస్టీ ప్రక్రియ కూడా కొన్ని విభాగాలకే పరిమితమవగా, తమను కూడా అమ్నెస్టీ ద్వారా సమస్యల నుంచి బయటపడేయాలని కొందరు కోరుతున్నారు. జులై 1న అమ్నెస్టీ ప్రారంభమైంది. ఇండియా నుంచి 40 మంది వరకూ ఇలా అమ్నెస్టీని సంప్రదించారు. అయితే మొదట వారంతా నిబంధనలు అతిక్రమించినందుకుగాను ఫైన్‌ కట్టవలసి ఉంటుందని బహ్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. బహ్రెయిన్‌లో 2010లో నిర్వహించిన అమ్నెస్టీ ద్వారా 6000 మంది కార్మికులు దేశాన్ని విడిచి వెళ్ళారు. గత ఆగస్ట్‌లో 2000 మంది ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌ దేశాన్ని అమ్నెస్టీ ద్వారా విడిచారు. 8 వేలమంది తమ స్టేటస్‌ని లీగలైజ్‌ చేసుకున్నారు. 

 

--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com