2032 ఒలింపిక్స్కు బిడ్ దాఖలు చేయనున్న భారత్
- June 17, 2017
- ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్
2032 ఒలింపిక్స్కు భారత్ బిడ్ దాఖలు చేసే అవకాశముందని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. రామచం ద్రన్ వెల్లడించారు. ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు నడుస్తున్నాయని కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే వీలుందని రామచంద్రన్ అన్నాడు. తమిళనాడు ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా రామచంద్రన్ మీడియాతో మాట్లాడాడు. ' 2032 ఒలింపిక్స్ బిడ్ దాఖలు చేసే అవకాశాలు పరిశీలించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇది చాలా ప్రాథమిక దశ. ఇంకా ఎన్నో అనుమతులు పొందాల్సి ఉంది. ఐఓఏ పూర్తి ప్రణాళిక ప్రభుత్వానికి అందజేస్తే, వారు పరిశీలించాలి. అక్కడ్నుంచి హామీ లభిస్తే.. ఐఓఏ బిడ్ దాఖలు చేస్తుంది. ప్రభుత్వం సహా ప్రతిపక్ష నాయకుడి అంగీకారం సైతం కావాలి. ఒలింపిక్ నగరం ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి సహా ప్రతిపక్ష నాయకుడు కూడా అంగీకరించాలి.
దీనికి కనీసం 7-8 ఏండ్ల నుంచే సిద్ధం కావాలి. ఓవరాల్గా 12 మిలియన్ డాలర్ల వ్యయం కానుండగా.. దీన్ని ఎనిమిదేండ్లలో వ్యవధిలో ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆర్థికంగానూ పెద్ద ఇబ్బంది ఉండదు' అని రామచంద్రన్ తెలిపాడు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







