ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లోకి తెలుగు బ్యాడ్మింటన్ స్టార్
- June 17, 2017
తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్.. ఇండోనేషియా ఓపెన్ టైటిల్కు అడుగు దూరంలో నిలిచాడు. ఇవాళ జరిగిన సెమీస్లో ప్రపంచ నెంబర్ వన్ సన్ వాన్ హో పై ఘన విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఫస్ట్ సెట్ను 21-15 తేడాతో గెలుచుకున్నాడు శ్రీకాంత్. అయితే... రెండో సెట్ను 18-21 తేడాతో కోల్పోవడంతో.. మూడో సెట్ కీలకంగా మారింది. విజయం కోసం ఇద్దరూ పోటాపోటీగా తలపడినా.. 24-22 తేడాతో సెట్ కైవసం చేసుకుని.. సన్ వాన్కు షాక్ ఇచ్చాడు శ్రీకాంత్. సన్ వాన్ హో తో గతంలో జరిగిన నాలుగు మ్యాచ్లనూ వరుసగా ఓడిపోయినప్పటికీ.. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడి పైచేయి సాధించాడు శ్రీకాంత్. ఆదివారం జరిగే మ్యాచ్లో టైటిల్ కోసం సాకాయ్తో తలపడనున్నాడు. మరో సెమీస్లో ఇండియన్ బాడ్మింటన్ స్టార్ ప్రణయ్.. జపాన్కు చెందిన సాకాయ్ చేతిలో అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. లేదంటే... ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లో.. ఇద్దరూ ఇండియన్సే తలపడాల్సి వచ్చేది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







