పోర్చుగల్ చేరుకున్నభారత్ ప్రధాని
- June 24, 2017
లిస్బన్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు పోర్చుగల్ చేరుకున్నారు. లిస్బన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. మోదీ రాక నేపథ్యంలో ఎయిర్పోర్టు ప్రాంగణంలో ఆయన చిత్రపటాలతో హోర్డింగ్లు ఏర్పాటుచేశారు. పర్యటనలో భాగంగా.. పోర్చుగల్ ప్రధాని అంటానియో కోస్టాతో మోదీ భేటీ కానున్నారు.
పోర్చుగల్ నుంచి ప్రధాని మోదీ అమెరికా బయల్దేరుతారు. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం వాషింగ్టన్ చేరుకుంటారు. రెండు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత శ్వేతసౌధంలో ఏర్పాటుచేసే విందులో పాల్గొంటారు. అధ్యక్షుడిగా ట్రంప్ ఇస్తున్న విందులో పాల్గొంటున్న తొలి దేశాధినేత మోదీనే కావడం విశేషం. అమెరికా నుంచి మోదీ నెదర్లాండ్స్ వెళ్లి ప్రధాని మార్క్ రట్టేతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









