నెదర్లాండ్స్ బయల్దేరిన నరేంద్రమోదీ

- June 26, 2017 , by Maagulf
నెదర్లాండ్స్ బయల్దేరిన నరేంద్రమోదీ

రెండు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడి నుంచి నెదర్లాండ్స్ బయల్దేరారు. నెదర్లాండ్స్లో ఆ దేశ ప్రధాని మార్క్ రట్టేతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాద సంబంధిత అంశాలపై ఇరు నేతలు చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా.. డచ్ కంపెనీ సీఈవోలతో కూడా ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ అలెగ్జాండర్, రాణి మాక్సిమాను కూడా మోదీ కలవనున్నారు. ఆ తర్వాత పర్యటన ముగించుకుని భారత్ తిరుగు ప్రయాణమవుతారు.
మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈ నెల 24న మోదీ పోర్చుగల్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి అమెరికా వెళ్లిన మోదీ రెండు రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తొలిసారిగా భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా సీఈవోల సదస్సులో పాల్గొన్నారు.

భారత-అమెరికన్ విందులోనూ మోదీ ప్రసంగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com