దుబాయ్ లో మహిళను హత్య చేసిన వ్యక్తి.. భవనం వెలుపల ఖననం
- July 10, 2017
నగరంలోని ఓ భవనంలో పనిమనిషిగా జీవనం కొనసాగిస్తున్న ఓ నేపాలీ మహిళ హత్యకు గురైంది. కలకలం రేపిన ఈ హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలియజేశారు. అల్ బర్షా ప్రాంతంలోని ఓ భవన ఆవరణలో మహిళ మృతదేహం ఉందని పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరపగా కంగుతినే నిజాలు తెలిశాయి.
హత్యకు గురైన మహిళ.. తాను పని చేస్తున్న భవనంలో పనిచేస్తున్న, తన దేశానికే చెందిన వ్యక్తితో కొంతకాలంగా అక్రమసంబంధాన్ని కొనసాగిస్తోంది. హత్యకు జరిగిన రోజు నిందితుడి రూంకు మహిళ వెళ్లింది. ఇద్దరూ కలిసి రోజంతా చాలాసేపు గడిపారు. మధ్యాహ్నం భోజనం చేశారు. లైంగికంగా కలిశారు. అనంతరం పనికి వెళ్తున్న నిందితుడిని వెళ్లోద్దంటూ, తనతో గడపాలని మృతురాలు అడ్డగించింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. నిందితుడు బయటకు వెళ్తుండగా ఆమె గట్టిగా అరిచింది. అరవకుండా నోరు మూసిన నిందితుడు ఆమెను బాత్రూంలోకి ఈడ్చుకెళ్లాడు. అనంతరం బెడ్రూంలోకి తీసుకెళ్లి వదిలేశాడు. పనికి వెళ్లి తిరిగొచ్చే సరికి ఆమె చనిపోయిఉందని, ఉద్దేశ్యపూర్వకంగా చంపలేదని నిందితుడు పోలీసులు ముందు ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య జరిగిన తోపులాటల్లో బలమైన గాయాలవ్వడంతో మహిళ చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కోర్టులో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









