శేఖర్ కమ్ముల 'ఫిదా' ఆడియో రిలీజ్
- July 11, 2017
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్-సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం 'ఫిదా'.శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ స్వరాలు సమకూర్చారు.తాజాగా సోమవారం రాత్రి ఈచిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ " ఈ చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా అన్ని హంగులతో తెరకెక్కించాం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన 'తొలిప్రేమ' చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఎలా ఫీల్ అయ్యారో ఈచిత్రం కూడా ప్రేక్షకుల్లో అదే ఫీలింగ్ తెస్తుంది.సినిమా తొలిప్రేమ,సుస్వాగతం అంతటి ఘనవిజయం సాధిస్తుంది అని తెలుపుతూ..ఈసినిమాను యువత ఎన్నటికీ మరచిపోలేరు అన్నాడు.వరుణ్ తేజ్ లో మెగా బ్రదర్స్ నటనలోని అన్ని షేడ్స్ కనిపిస్తాయి.సాయిపల్లవి ఆధ్బుతమైన నటి,డాన్సర్.ఈ సినిమా ద్వారా తానేంటో రుజువు చేసుకుంటుంది సాయిపల్లవి. చాలాకాలం తర్వాత సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నా..ఖచ్చితంగా ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్ లో గొప్ప చిత్రం కాబోతుంది అన్నాడు.తెలంగాణా లోని బాన్సువాడలో షూటింగ్ చేస్తున్నపుడు అక్కడి ప్రజల సహకారం సంతోషాన్నిచ్చింది" అని తెలిపాడు.
సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్,పోస్టర్ లు ప్రేక్షకలోకాన్ని బాగా ఆకట్టుకున్నాయి.దీంతో ఈ సినిమా వరుణ్ తేజ్ కి టర్నింగ్ కావడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









