శేఖర్ కమ్ముల 'ఫిదా' ఆడియో రిలీజ్
- July 11, 2017
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్-సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం 'ఫిదా'.శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ స్వరాలు సమకూర్చారు.తాజాగా సోమవారం రాత్రి ఈచిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ " ఈ చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా అన్ని హంగులతో తెరకెక్కించాం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన 'తొలిప్రేమ' చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఎలా ఫీల్ అయ్యారో ఈచిత్రం కూడా ప్రేక్షకుల్లో అదే ఫీలింగ్ తెస్తుంది.సినిమా తొలిప్రేమ,సుస్వాగతం అంతటి ఘనవిజయం సాధిస్తుంది అని తెలుపుతూ..ఈసినిమాను యువత ఎన్నటికీ మరచిపోలేరు అన్నాడు.వరుణ్ తేజ్ లో మెగా బ్రదర్స్ నటనలోని అన్ని షేడ్స్ కనిపిస్తాయి.సాయిపల్లవి ఆధ్బుతమైన నటి,డాన్సర్.ఈ సినిమా ద్వారా తానేంటో రుజువు చేసుకుంటుంది సాయిపల్లవి. చాలాకాలం తర్వాత సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నా..ఖచ్చితంగా ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్ లో గొప్ప చిత్రం కాబోతుంది అన్నాడు.తెలంగాణా లోని బాన్సువాడలో షూటింగ్ చేస్తున్నపుడు అక్కడి ప్రజల సహకారం సంతోషాన్నిచ్చింది" అని తెలిపాడు.
సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్,పోస్టర్ లు ప్రేక్షకలోకాన్ని బాగా ఆకట్టుకున్నాయి.దీంతో ఈ సినిమా వరుణ్ తేజ్ కి టర్నింగ్ కావడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







