ఇంటికి నిప్పు: నిందితుడికి మూడేళ్ళ జైలు
- July 12, 2017
ఓ మహిళ ఇంటిని, కారుని తగలబెట్టిన కేసులో ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అగ్ని ప్రమాదం కారణంగా 2000 బహ్రెయినీ దినార్స్ నష్టం వాటిల్లింది. 20 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి, బాధితురాలి ఇంట్లోని పెట్ బర్డ్స్ని దొంగిలించే క్రమంలో విఫలమై, అసహనంతో ఆ ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో నిందితుడికి మరో వ్యక్తి కూడా సహకరించాడు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నదీ తెలియరాలేదు. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు ఇంట్లో లేరు. పక్షుల్ని దొంగిలించేందుకోసం ఫెన్సింగ్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించామనీ, అయితే అక్కడ కేజ్లో పక్షులేమీ లేకపోవడంతో నిప్పు పెట్టాననీ, వెళుతూ వెళుతూ సీసీటీవీ కెమెరాని ధ్వంసం చేశామని నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడిపై గతంలో 31 కేసులున్నాయి. ఆ కేసుల్లో 20 ఏళ్ళ జైలు శిక్ష కూడా పడింది నిందితుడికి.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









