ఇంటికి నిప్పు: నిందితుడికి మూడేళ్ళ జైలు
- July 12, 2017
ఓ మహిళ ఇంటిని, కారుని తగలబెట్టిన కేసులో ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అగ్ని ప్రమాదం కారణంగా 2000 బహ్రెయినీ దినార్స్ నష్టం వాటిల్లింది. 20 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి, బాధితురాలి ఇంట్లోని పెట్ బర్డ్స్ని దొంగిలించే క్రమంలో విఫలమై, అసహనంతో ఆ ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో నిందితుడికి మరో వ్యక్తి కూడా సహకరించాడు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నదీ తెలియరాలేదు. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు ఇంట్లో లేరు. పక్షుల్ని దొంగిలించేందుకోసం ఫెన్సింగ్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించామనీ, అయితే అక్కడ కేజ్లో పక్షులేమీ లేకపోవడంతో నిప్పు పెట్టాననీ, వెళుతూ వెళుతూ సీసీటీవీ కెమెరాని ధ్వంసం చేశామని నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడిపై గతంలో 31 కేసులున్నాయి. ఆ కేసుల్లో 20 ఏళ్ళ జైలు శిక్ష కూడా పడింది నిందితుడికి.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







