అర టన్ను హాషిష్, 63,000 క్యాప్టగాన్ పిల్స్ స్వాధీనం
- July 12, 2017
బోర్డర్ గార్డ్స్, గత వారంలో జరిపిన తనిఖీల్లో అర టన్ను హాషిష్, 63,000 కాప్టగాన్ పిల్స్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 19 స్మగ్లర్స్ని కూడా బోర్డర్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. బోర్డర్ గార్డ్స్ అధికార ప్రతినిథి కల్నల్ సహెర్ బిన్ మొహమ్మద్ అల్ హర్బి మాట్లాడుతూ, బోర్డర్ లోంచి అక్రమంగా కింగ్డమ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారనీ, యెమెన్ నుంచి ఎక్కువగా వారు వస్తున్నారనీ, నార్కోటిక్స్ని స్మగ్లింగ్ చేయడమే వీరి పని అని తెలిపారు. 14 మంది ఇథియోపియన్లను, 5 మంది యెమనీలను అరెస్ట్ చేశామని వివరించారు. 543,200 కిలోల హాషిష్, 63,260 నార్కోటిక్ పిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారాయన. స్మగ్లింగ్ యత్నాల్ని తిప్పి కొట్టడంలో బోర్డర్ గార్డ్స్ అత్యంత సమర్థంగా వ్యవహరిస్తున్నట్లు వివరించారు అల్ హర్బి.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









