డ్రగ్స్‌కేసులో భారతీయుడికి ఉరి

- July 14, 2017 , by Maagulf
డ్రగ్స్‌కేసులో భారతీయుడికి ఉరి

డ్రగ్స్‌ అక్రమ రవాణా చేస్తున్న ఓ నేరస్థుడికి సింగపూర్‌లో ఈ రోజు ఉరిశిక్ష అమలు చేశారు. 29 ఏళ్ల భారత సంతతికి చెందిన మలేషియా వ్యక్తి ప్రభాకరణ్‌ శ్రీవిజయన్‌కు అక్కడి న్యాయస్థానం 2014లో మరణశిక్షను ఖరారు చేసింది. 22.24 గ్రాములు డయామార్ఫిన్‌ అనే మత్తు పదార్థాన్ని రవాణా చేస్తుండగా అతన్ని 2012లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కోర్టు అతినికి మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షను ఐక్య రాజ్యసమితి, ఇతర మానవహక్కుల సంఘాలు వ్యతిరేకించినప్పటికీ వాటిని సింగపూర్‌ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.

నిన్న శ్రీవిజయన్‌ కుటుంబసభ్యుల తరఫున అతని లాయర్‌ సింగపూర్‌ అపెక్స్‌ కోర్టును సంప్రదించారు. మలేషియాలో ఈ కేసుకు సంబంధించి చేసుకున్న అప్పీల్‌ పెండింగ్‌లో ఉందని.. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరారు. అయితే ఓ దేశంలోని న్యాయపరమైన వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోలేదని పేర్కొంటూ జడ్జి స్టే ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో సింగపూర్‌లోని చాంగీ జైలులో శ్రీవిజయన్‌కు ఉరిశిక్ష అమలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com