డ్రగ్స్కేసులో భారతీయుడికి ఉరి
- July 14, 2017డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ఓ నేరస్థుడికి సింగపూర్లో ఈ రోజు ఉరిశిక్ష అమలు చేశారు. 29 ఏళ్ల భారత సంతతికి చెందిన మలేషియా వ్యక్తి ప్రభాకరణ్ శ్రీవిజయన్కు అక్కడి న్యాయస్థానం 2014లో మరణశిక్షను ఖరారు చేసింది. 22.24 గ్రాములు డయామార్ఫిన్ అనే మత్తు పదార్థాన్ని రవాణా చేస్తుండగా అతన్ని 2012లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కోర్టు అతినికి మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షను ఐక్య రాజ్యసమితి, ఇతర మానవహక్కుల సంఘాలు వ్యతిరేకించినప్పటికీ వాటిని సింగపూర్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.
నిన్న శ్రీవిజయన్ కుటుంబసభ్యుల తరఫున అతని లాయర్ సింగపూర్ అపెక్స్ కోర్టును సంప్రదించారు. మలేషియాలో ఈ కేసుకు సంబంధించి చేసుకున్న అప్పీల్ పెండింగ్లో ఉందని.. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరారు. అయితే ఓ దేశంలోని న్యాయపరమైన వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోలేదని పేర్కొంటూ జడ్జి స్టే ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో సింగపూర్లోని చాంగీ జైలులో శ్రీవిజయన్కు ఉరిశిక్ష అమలు చేశారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత