డ్రగ్స్కేసులో భారతీయుడికి ఉరి
- July 14, 2017
డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ఓ నేరస్థుడికి సింగపూర్లో ఈ రోజు ఉరిశిక్ష అమలు చేశారు. 29 ఏళ్ల భారత సంతతికి చెందిన మలేషియా వ్యక్తి ప్రభాకరణ్ శ్రీవిజయన్కు అక్కడి న్యాయస్థానం 2014లో మరణశిక్షను ఖరారు చేసింది. 22.24 గ్రాములు డయామార్ఫిన్ అనే మత్తు పదార్థాన్ని రవాణా చేస్తుండగా అతన్ని 2012లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కోర్టు అతినికి మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షను ఐక్య రాజ్యసమితి, ఇతర మానవహక్కుల సంఘాలు వ్యతిరేకించినప్పటికీ వాటిని సింగపూర్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.
నిన్న శ్రీవిజయన్ కుటుంబసభ్యుల తరఫున అతని లాయర్ సింగపూర్ అపెక్స్ కోర్టును సంప్రదించారు. మలేషియాలో ఈ కేసుకు సంబంధించి చేసుకున్న అప్పీల్ పెండింగ్లో ఉందని.. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరారు. అయితే ఓ దేశంలోని న్యాయపరమైన వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోలేదని పేర్కొంటూ జడ్జి స్టే ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో సింగపూర్లోని చాంగీ జైలులో శ్రీవిజయన్కు ఉరిశిక్ష అమలు చేశారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









