ఆంధ్ర, తెలంగాణ లో రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్
- July 17, 2017
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు తొలి ఓటు వేశారు. ఆయన తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస రావు, పరిటాల సునీతో పాటు ఎమ్మెల్యేలు బాలకృష్ణ, పల్లె రఘునాథ రెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. ఎన్డీఏ అభ్యర్థి కోవింద్ ఎన్నిక కావడమని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత జగన్ తో కలిసి ప్రత్యేక బస్సులో అమరావతికి వెళ్లారు. జగన్ తర్వాత వరుసగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఇటు తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ఓటు వేశారు. స్పీకర్ మధుసూదనాచారి ఆ తర్వాత ఓటుహక్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు టీఆర్ఎస్ భవన్ నుంచి అసెంబ్లీకి ప్రత్యేక బస్సులో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క గీతారెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామ్ నాథ్ కోవింద్ విజయం ఖాయమని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పై భారీ ఆశలు పెట్టుకుంది. ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందేలా చూసిన మాజీ స్పీకర్ మీరా కుమార్ కు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధానుసారం ఓటేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!







