ఎన్నారైలకు ఓటు హక్కు ఎప్పుడు: సుప్రీంకోర్టు ప్రశ్న
- July 26, 2017
ఎన్నారైలకు ఓటు హక్కు ఎప్పటికల్లా కల్పిస్తారు? అని భారత అత్యున్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వాన్ని ్పశ్నించింది. చీఫ్ జస్టిస్ జెఎస్ ఖెహర్, జస్టిస్ డివై చంద్రచూడ్లతో కూడిన బెంచ్, అటార్నీ జనరల్ ఇచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంది. పార్లమెంటులో రిప్రెజెంటేషన్ ఆఫ్ పీపుల్ (ఆర్ఐపి)కి మార్పులు చేర్పులు చేసేందుకు పార్లమెంటు ఆమోదం అవసరమని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ న్యాయస్థానానికి తెలిపారు. కేంద్ర మంత్రుల సమావేశంలో, ఈ విషయానికి సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగిందని కూడా న్యాయస్థానానికి విన్నవించారు అటార్నీ జనరల్. నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఇ-బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించే విషయమై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నా, చిత్తశుద్ధితో పనిచేయడంలేదన్న విమర్శలు వినవస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం









