మరోసారి జనం మధ్యలోకి జనసేన అధినేత

- July 26, 2017 , by Maagulf
మరోసారి జనం మధ్యలోకి జనసేన  అధినేత

జనసేన నేత పవన్ కళ్యాణ్ మరోసారి జనాల మధ్యలోకి రాబోతున్నాడు. జులై 29 న ఉద్దానంలోని కిడ్నీ బాధితులతో పవన్ మాట్లాడి , అక్కడ పర్యటించబోతున్నట్లు సమాచారం. మరుసటి రోజు జులై 30న వైజాగ్ హార్వర్డ్‌ వైద్యులతో పవన్‌ సమావేశమై చర్చిస్తారు. అనంతరం పవన్‌, వైద్యులు ముఖ్యమంత్రితో భేటీ అయి ఉద్దానంలో తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడబోతున్నారని సమాచారం.
పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కి చెందిన వైద్యులతో ఈ అంశంపై చర్చించారు. ఆయన కొద్ది నెలల కిందట హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఉపన్యసించేందుకు వెళ్లారు. ఆ సందర్బంగా అక్కడి మెడికల్‌ స్కూల్‌ వైద్యులతో మాట్లాడుతూ.. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు పెరగడం, వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై చర్చించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com