హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసులో ఎవరినీ వదలం- సీఎం కేసీఆర్

- July 27, 2017 , by Maagulf
హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసులో ఎవరినీ వదలం- సీఎం కేసీఆర్

హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ రాకెట్‌పై స్పందించారు సీఎం కేసీఆర్. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా లెక్క చేయబోమన్నారు. డ్రగ్స్‌ మాఫియా అంతు చూడాలని పోలీసులకు చెప్పానని, పిల్లలకు కూడా డ్రగ్స్‌ అలవాటు  చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీన్ని మొత్తం అరికట్టాలని అకున్‌ సభర్వాల్‌కు చెప్పానని, ఆయన పట్టుబట్టి చక్కదిద్దుతున్నట్లు చెప్పుకొచ్చారు.  ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టబోమని, హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో మాదకద్రవ్యాలకు చోటులేకుండా చేస్తామని, ఇది.. సమాజం మీద తీవ్ర దుష్ప్రభావం చూపి, జీవితాలను నాశనం చేస్తుందన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో సీఎం కేసీఆర్ సుమారు మూడుగంటలపాటు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com