డబుల్ కా మీఠా
- August 08, 2017కావలసిన పదార్థాలు
తెల్ల బ్రెడ్ స్లయిసులు - 8
పాలు - 1 కప్పు
పంచదార - మూడున్నర టేబుల్ స్పూన్లు
మీగడ - 3 టేబుల్ స్పూన్లు
కరిగించిన తాజా నెయ్యి - 2 టే.స్పూన్లు
నానబెట్టి, తొక్కతీసి, తరిగిన బాదం - 12
తరిగిన పిస్తా - అర కప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు
తయారీ విధానం
పాలను మందపాటి గిన్నెలో మరిగించాలి.
మరో గిన్నెలో పంచదార, రెండు టే.స్పూన్ల నీళ్లు వేసి పాకం పట్టాలి.
బ్రెడ్ స్లయిసె్సల అంచులు కట్ చేసి త్రికోణాకారంలో కత్తిరించుకోవాలి.
వీటిని నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి.
పాలు మరిగాక మీగడ వేసి చిక్కబడేవరకూ ఉడికించాలి.
వేయించిన బ్రెడ్ ముక్కలను చక్కెర పాకంలో ముంచి తీసి మరో వెడల్పాటి గిన్నెలో పరుచుకోవాలి.
వాటి పైన చిక్కటి పాలను పోసి, పైన మిగిలిన చక్కెర పాకం పోయాలి.
తరిగిన బాదం పప్పులు, బాదం పప్పులు చల్చి పొయ్యి మీద చిన్న మంట మీద ఉంచాలి.
10 నిమిషాల్లో నెయ్యి పైకి తేలుతూ డబుల్ కా మీఠా నోరూరించేలా తయారవుతుంది.
అప్పుడు కుంకుమ పువ్వు చల్లి వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..