ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సైతం పాదచారులు దాటే సదుపాయం

- August 08, 2017 , by Maagulf
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సైతం పాదచారులు దాటే సదుపాయం

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సైతం పాదచారులు నిర్భయంగా దాటే సదుపాయంను ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ సహకారంతో రేపటి నుంచి అమలు కానున్నట్లు మునిసిపాలిటీలు మరియు పట్టణ ప్రణాళిక పనుల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. మనామ లోని  షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవే మరియు షేక్ జబెర్ అల్ సాబా హైవే యొక్క ఖండనలో అలాగే  ఉమ్ అల్ హస్సమ్ ప్రాంతంలో ఉమ్ అల్ హస్సమ్ ఫ్లైఓవర్ క్రింద. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పాదచారులు దాటే సదుపాయం ఏర్పాటు చేయబడింది. ఆగస్టు 10 వ తేదీ ( రేపటి ) నుండి సిగ్నళ్ల  సమీపంలో ఈ కొత్త సదుపాయం అమలు అవుతుంది. రహదారి వినియోగదారులందరూ భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను గమనించి ఆయా నియమాలకు కట్టుబడి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com