డబ్బు అపహరించిన కేసులో ఆసియా కార్మికుడు జైలుశిక్ష ...దేశ బహిష్కరణ
- August 12, 2017
2,000 బేహారిన్ దినార్లను దొంగతనం చేసిన కేసులో 32 ఏళ్ల ఆసియా దేశస్థుడికి మూడు నెలల జైలుశిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరణ శిక్షను సెంట్రల్ హయ్యర్ క్రిమినల్ కోర్ట్ (అప్పీల్స్ కోర్టు) విధించింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఒక క్లయింట్ నుండి 2,000 బేహారిన్ దినార్లను తీసుకొన్న తర్వాత రుసటి రోజున రసీదుని అందజేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాక ఆ నిందితుడు తానూ పనిచేస్తున్న తన యజమానిని వద్దకు వెళ్లి తనకు అత్యవసరంగా సెలవులు కావాలని అందుకు అనుమతించమని కోరారు, తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా తానూ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందని నమ్మబలికెడు. ఆ యజమాని ప్రతివాది మాటలకు కరిగిపోయి 500 బేహారిన్ దినార్లనుతన విమాన టికెట్ మరియు రెసిడెన్సీ రద్దు ఫీజుల ఖర్చుతో యజమాని నిందితునికి అత్యవసర సెలవును మంజూరు చేయడానికి అంగీకరించాడు.తన డబ్బుకి ఎటువంటి రసీదు ఇవ్వకుండా దేశం నుంచి నిందితుడు పారిపోవడానికి ఆ ఉద్యోగి యత్నిస్తున్నట్లు కస్టమర్ పోలీసులకు పిర్యాదు చేసాడు. నిందితుడిని అరెస్టు చేసినపుడు, తనపై వచ్చిన ఆరోపణలను ప్రతివాది ఖండించాడు ఏది ఏమయినప్పటికీ, ముద్దాయిని మూడు నెలల పాటు ఖైదు చేసి, దేశం నుండి బహిష్కరించి తిరిగి రాజ్యములో ప్రవేశించకుండా శాశ్వతంగా నిషేధించాలని తుది తీర్పు కోర్టు ఇచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







