27న బెజవాడకు అమిత్ షా
- August 12, 2017
2019 ఎన్నికల నేపథ్యంలో ఏపీలో బలోపేతమయ్యేందుకు బీజేపీ ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తరచుగా రాష్ట్రానికి వస్తూ పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఆయన బెజవాడలో మకాం వేయనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 90 రోజుల పాటు పర్యటించిన షా జూన్లో తెలుగు రాష్ట్రాల పర్యటకు వచ్చారు. తెలంగాణలో మూడు రోజులు పర్యటించినా ఏపీలో మాత్రం విజయవాడ సభకే పరిమితమయ్యారు. వార్డు కమిటీలు తొందరగా పూర్తి చేయాలని, త్వరలో మళ్లీ వస్తానని చెప్పిన ఆయన.. రాష్ట్రంలో పార్టీకి పెద్దదిక్కయిన వెంకయ్యఉప రాష్ట్రపతి అయ్యాక వస్తుండడం గమనార్హం. మూడు రోజుల పాటు విజయవాడలోనే మకాం వేసి ఒకరోజు రాష్ట్ర పార్టీ ముఖ్యులు, రాష్ట్ర మోర్చాల అధ్యక్షులతో, రెండో రోజు జిల్లాల అధ్యక్షులు, మేధావులు, పార్టీ అనుబంధ సంఘాల ముఖ్యులతో మాట్లాడతారు. మూడో రోజు బూత్ కమిటీలతో జిల్లాకు ఐదు నుంచి పది మందితో ఫోనులో మాట్లాడతారని సమాచారం.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







