తెలంగాణా ప్రజా సమితి- ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన దసరా,బతుకమ్మ మరియు బక్రీద్ సంబరాలు
- October 24, 2015

23-10-2015 రోజున తెలంగాణా ప్రజా సమితి ఖతార్ ఆధ్వర్యంలో దోహా ఖతార్ లోని అల్ మహా అకాడమిలో జరిగిన దసరా, బతుకమ్మ మరియు బక్రీద్ సంబరాలకు పెద్ద ఎత్తున స్పందించి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజా సమితి ఖతార్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో 2015 -16 కార్యవర్గం ఏమ్పికా మరియు ప్రమాణ స్వీకారం, బతుకమ్మ ఆటలు, దాన్దియ నృత్యం, బాల బాలికల నృత్య ప్రదర్శన, సాంస్కృతిక నృత్యాలు, బక్రీద్ అలై భాలాయి, పిల్లల పలు రకాల వేషధారణ, ఫ్యామిలి ఆటలు, తెలంగాణా సాంస్కృతిక బృందం ధూమ్ ధామ్, దసరా జమ్మి ఆకు పంచుకొని అలై భాలాయి, ఈ కార్యక్రమం లో ఖతార్ తెలంగాణా కార్మికులు స్వయంగా చేసిన తెలంగాణా కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణ, బతుకమ్మ వేషధారణ, సంప్రదాయ నృత్యం, తెలంగాణా జానపద గాయకుల గాత్రం ఆకట్టుకొన్నాయి.
ఈ కార్యక్రమం లో ఇండియన్ కల్చరల్ సెంటర్ ఖతార్ (ICC ) అధ్యక్షులు శ్రీ గిరీష్ కుమార్ గారు , ICBF నుండి శ్రీ అరవింగ్ పాటిల్ గారు, Indian Embassy ఖతార్ నుండి శ్రీ సరూప్ సింగ్ గారు ముఖ్య అథిదులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వారి సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలంగాణా ప్రజా సమితి, ఖతార్ వారికి మాగల్ఫ్.కామ్ తరపున ప్రత్యేక అభినందనలు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)




తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







