వక్కంతం వంశీ, వెంకటేష్ కోసం ఓ యాక్షన్ స్టోరీని రెడీ చేశాడట
- October 24, 2015
'గోపాల గోపాల' లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత తదుపరి సినిమాపై విక్టరీ వెంకటేష్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యంగ్ హీరోలు హవా చూపిస్తుండటంతో ఎలాంటి కథ ఎంచుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో వరుసగా కథలు వింటూ కాలం గడిపేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఈ గ్యాప్ లో మారుతి, క్రాంతి మాధవ్ లాంటి దర్శకులకు వెంకీ ఓకె చెప్పాడన్న టాక్ వినిపించినా, ఆ సినిమాలేవి సెట్స్ మీదకు రాలేదు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ కథా రచయితగా గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ, వెంకటేష్ కోసం ఓ యాక్షన్ స్టోరీని రెడీ చేశాడట. ఇప్పటికే ఈ కథను వెంకీకి వినిపించిన వంశీ అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని వక్కంతం వంశీ స్వయంగా ప్రకటించాడు. ఈ కథలో వెంకటేష్ ను మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మారుతి, క్రాంతి మాధవ్ లు సొంత కథలతో వెంకటేష్ డేట్స్ కోసం ఎదురుచూస్తుండగా, వక్కంతం వంశీ ఇచ్చిన కథను గోపాల గోపాల ఫేం కిశోర్ కుమార్ పార్థసాని డైరెక్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈ మూడు ప్రాజెక్ట్స్ లో వెంకీ, ఏ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళతాడో చూడాలి
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







