వక్కంతం వంశీ, వెంకటేష్ కోసం ఓ యాక్షన్ స్టోరీని రెడీ చేశాడట
- October 24, 2015
'గోపాల గోపాల' లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత తదుపరి సినిమాపై విక్టరీ వెంకటేష్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యంగ్ హీరోలు హవా చూపిస్తుండటంతో ఎలాంటి కథ ఎంచుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో వరుసగా కథలు వింటూ కాలం గడిపేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఈ గ్యాప్ లో మారుతి, క్రాంతి మాధవ్ లాంటి దర్శకులకు వెంకీ ఓకె చెప్పాడన్న టాక్ వినిపించినా, ఆ సినిమాలేవి సెట్స్ మీదకు రాలేదు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ కథా రచయితగా గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ, వెంకటేష్ కోసం ఓ యాక్షన్ స్టోరీని రెడీ చేశాడట. ఇప్పటికే ఈ కథను వెంకీకి వినిపించిన వంశీ అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని వక్కంతం వంశీ స్వయంగా ప్రకటించాడు. ఈ కథలో వెంకటేష్ ను మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మారుతి, క్రాంతి మాధవ్ లు సొంత కథలతో వెంకటేష్ డేట్స్ కోసం ఎదురుచూస్తుండగా, వక్కంతం వంశీ ఇచ్చిన కథను గోపాల గోపాల ఫేం కిశోర్ కుమార్ పార్థసాని డైరెక్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈ మూడు ప్రాజెక్ట్స్ లో వెంకీ, ఏ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళతాడో చూడాలి
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









