ఇటలీ పర్యాటక కేంద్రంలో సోమవారం బారి భూంకంపం
- August 22, 2017
- ఒకరు మృతి, పలువురికి గాయాలు
ఇటలీలోని ఇచియా అగ్నిపర్వత ప్రాంతానికి సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంలో సోమవారం భూకంపం సంభవించింది. రిచ్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఈ భూకంప తీవ్రతకు స్థానిక మహిళ ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. అనేకమంది ఆచూకీ తెలియరావడం లేదు. వీరు కూలిపోయిన భవనాల కింద చిక్కుకుపోయి వుంటారని భావిస్తున్నారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. శిధిలాల కింద చిక్కుకుపోయి చనిపోయిన ఆ మహిళ మృతదేహాన్ని ఇంకా వెలికితీయలేదు. శిధిలాల వెలికితీతకు చర్యలు తీసుకుంటున్నామని, పెద్ద ఎత్తున గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు. శిధిలాల కింద చిక్కుకుపోయిన ముగ్గురు పిల్లలను కాపాడారు. ఆ దీవి నుండి ప్రజలను తరలించేందుకు బోట్లను, హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. గాయపడిన వారిని వైద్య సాయం నిమిత్తం హెలికాప్టర్లలో తక్షణమే నాప్లెస్కు తరలించారు. నాప్లెస్ నగరానికి సమీపంలో, ఇటలీ తీర ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరంలో రాత్రి 9గంటల సమయంలో భూ కంపం వచ్చినట్లు స్థానిక మీడియా వార్తలు తెలిపాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









