రాజధానికి వెళ్తున్న సీఎం కేసీఆర్

- October 25, 2015 , by Maagulf
రాజధానికి వెళ్తున్న సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆరునెలల తర్వాత దేశ రాజధానికి వెళ్తున్న సీఎం రెండురోజులపాటు అక్కడ ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ర్టాల్లో అమలుచేసే పథకాలపై సబ్‌గ్రూపు రూపొందించే తుది నివేదికను ప్రధాని నరేంద్రమోదీకి సీఎం అందజేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ర్టానికి నిధుల పెంపు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుపై ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చర్చించే అవకాశముంది. ఢిల్లీ పర్యటనకు నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కేసీఆర్ సమావేశమై గంటకు పైగా వివిధ అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్ జైట్లీని కూడా కలిసే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com