'జై లవకుశ'లో మరో హీరోయిన్
- August 28, 2017
హైదరాబాద్: ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'జై లవకుశ'. బాబీ దర్శకుడు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉందట. అందులో కథానాయిక తమన్నా ఆడిపాడనున్నట్లు సమాచారం. మిల్కీబ్యూటీ అయితే పాటకు మరింత అందం తీసుకొస్తారని దర్శక-నిర్మాతలు భావించారట. ఈ మేరకు ఆమెను సంప్రదించగా నటించడానికి ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక గీతం ఇప్పటి వరకు వచ్చిన వాటితో పోల్చితే చాలా విభిన్నంగా ఉంటుందని, తమన్నా కొత్త అవతారంలో కనిపిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఎన్టీఆర్, తమన్నా జంటగా 'వూసరవెల్లి' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తమన్నా ఇప్పటికే 'జాగ్వార్', 'అల్లుడు శీను' తదితర చిత్రాల్లోని ప్రత్యేక గీతాల్లో ఆడిపాడారు. ప్రస్తుతం ఆమె కల్యాణ్రామ్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు.
'జై లవకుశ'లో నివేదా థామస్, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది. సెప్టెంబరు 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









