అమెరికాలో భారత్ విద్యార్థి మృతి
- September 03, 2017
వాషింగ్టన్: భారతదేశానికి చెందిన 22ఏళ్ల గగన్దీప్ సింగ్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి అమెరికాలోని వాషింగ్టన్లో హత్యకు గురయ్యాడు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న గగన్దీప్ ట్యాక్సీ డ్రైవర్గానూ పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన ట్యాక్సీలో ఎక్కిన 19ఏళ్ల యువకుడు గగన్దీప్ను కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి జాకబ్ కోలీమెన్గా అధికారులు గుర్తించారు. ఆగస్టు 28న వాషింగ్టన్లోని స్పోకనే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద కోలీమెన్ అనే యువకుడిని గగన్దీప్ తన ట్యాక్సీలో ఎక్కించుకున్నాడు. యూనివర్సీటిలో చదువుకునేందుకు సీటు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కోలీమెన్ ఆ కోపాన్నంతా గగన్దీప్పై చూపించి అతన్ని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గగన్దీప్ 2003 నుంచి అమెరికాలో నివాసం ఉంటున్నాడు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







