అమెరికాలో భారత్ విద్యార్థి మృతి
- September 03, 2017
వాషింగ్టన్: భారతదేశానికి చెందిన 22ఏళ్ల గగన్దీప్ సింగ్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి అమెరికాలోని వాషింగ్టన్లో హత్యకు గురయ్యాడు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న గగన్దీప్ ట్యాక్సీ డ్రైవర్గానూ పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన ట్యాక్సీలో ఎక్కిన 19ఏళ్ల యువకుడు గగన్దీప్ను కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి జాకబ్ కోలీమెన్గా అధికారులు గుర్తించారు. ఆగస్టు 28న వాషింగ్టన్లోని స్పోకనే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద కోలీమెన్ అనే యువకుడిని గగన్దీప్ తన ట్యాక్సీలో ఎక్కించుకున్నాడు. యూనివర్సీటిలో చదువుకునేందుకు సీటు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కోలీమెన్ ఆ కోపాన్నంతా గగన్దీప్పై చూపించి అతన్ని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గగన్దీప్ 2003 నుంచి అమెరికాలో నివాసం ఉంటున్నాడు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







