అమెరికాలో భారత్ విద్యార్థి మృతి

- September 03, 2017 , by Maagulf
అమెరికాలో భారత్ విద్యార్థి మృతి

వాషింగ్టన్‌: భారతదేశానికి చెందిన 22ఏళ్ల గగన్‌దీప్‌ సింగ్‌ అనే ఇంజినీరింగ్‌ విద్యార్థి అమెరికాలోని వాషింగ్టన్‌లో హత్యకు గురయ్యాడు. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న గగన్‌దీప్‌ ట్యాక్సీ డ్రైవర్‌గానూ పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన ట్యాక్సీలో ఎక్కిన 19ఏళ్ల యువకుడు గగన్‌దీప్‌ను కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి జాకబ్‌ కోలీమెన్‌గా అధికారులు గుర్తించారు. ఆగస్టు 28న వాషింగ్టన్‌లోని స్పోకనే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ వద్ద కోలీమెన్‌ అనే యువకుడిని గగన్‌దీప్‌ తన ట్యాక్సీలో ఎక్కించుకున్నాడు. యూనివర్సీటిలో చదువుకునేందుకు సీటు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కోలీమెన్‌ ఆ కోపాన్నంతా గగన్‌దీప్‌పై చూపించి అతన్ని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గగన్‌దీప్‌ 2003 నుంచి అమెరికాలో నివాసం ఉంటున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com