హజ్‌ మెట్రో: అంతా ప్రశాంతం

- September 04, 2017 , by Maagulf
హజ్‌ మెట్రో: అంతా ప్రశాంతం

మినా: హజ్‌ మెట్రో ట్రైన్‌ సర్వీస్‌, హోలీ సైట్స్‌ మధ్యన ప్రశాతంంగా నిర్వహణ జరుగుతున్నట్లు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ప్రెసిడెంట్‌ రుమైహ్‌ అల్‌ రుమైహ్‌ చెప్పారు. అల్‌ మషార్‌ అల్‌ మగద్దాస్సా మెట్రో, పవిత్ర ప్రాంతాల మధ్య యాత్రీకులకు అద్భుతంగా సేవలందిస్తోందని అల్‌ రుమైహ్‌ వివరించారు. ట్రైన్ల మూమెంట్స్‌ని ఎప్పటికప్పుడు ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ నిపుణులు పర్యవేక్షిస్తున్నాని ఆయన తెలిపారు. సెక్యూరిటీ ఏజెన్సీస్‌ ఈ విషయంలో అందిస్తున్న సహకారాన్ని ఆయన కొనియాడారు. పిటిఎ అధికారి మొహమ్మద్‌ ఫహ్ద్‌ అల్‌ షబ్రామి మాట్లాడుతూ, హజ్‌ మెట్రో పవిత్ర ప్రాంతాల మధ్య యాత్రీకుల రవాణాను స్మూత్‌గా చేస్తోందనీ, 20 కిలోమీటర్ల మేర 9 స్టేషన్లతో సేవలు అందిస్తోందనీ, ట్రైన్స్‌ పొడవు 300 మీటర్లుందని చెప్పారు. ఒక్కో రైల్‌ కార్‌, 3,000 మంది యాత్రీకులకు సేవలందిస్తోంది. గంటకు 72,000 మంది యాత్రీకుల్ని ఓ వైపు రవాణా చేస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com