కాళోజి పురస్కారం అందుకోనున్న వందేమాతరం శ్రీనివాస్

- September 05, 2017 , by Maagulf
కాళోజి పురస్కారం అందుకోనున్న వందేమాతరం శ్రీనివాస్

ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా, ప్రజా గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కు కాళోజి పురస్కారం ఇవ్వనున్నట్లు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షులు డి .సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భముగా డి .సురేష్ కుమార్ మాట్లాడుతూ - "గత 5 ఏళ్లుగా ప్రజా కవి కాళోజి నారాయణ రావు గారి జన్మదిన సందర్భంగా ఆయన పేరుమీద 'కాళోజి' పురస్కారం తెలుగు సినిమా పరిశ్రమ లోని ప్రముఖ రచయితలకు ఇస్తూవచ్చాము. ఈ ఏడాది ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయినా వందేమాతరం శ్రీనివాస్ కు ఈ అవార్డు ఇవ్వడానికి సంతోషంగా తెలియచేస్తున్నాను. 2016 లో రచయిత చంద్ర బోస్ కి కాళోజి అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది. వారం లో జరగబోయే ఈ ప్రదానోత్సవంలో ఒకే వేదిక పై చంద్ర బోస్, వందేమాతరం శ్రీనివాస్ లను సన్మానించడం జరుగుతుంది." తెలంగాణ టివి డెవలప్ మెంట్ ఫోరమ్, భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టివి రచయితల సంఘం ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com