భారత్ లో విమాన సిబ్బందిని దూషిస్తే కఠిన చర్యలు

- September 08, 2017 , by Maagulf
భారత్ లో విమాన సిబ్బందిని దూషిస్తే కఠిన చర్యలు

ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడబోమని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఎయిర్ పోర్టుల్లో అదుపు తప్పుతున్న ఎంపీల ప్రవర్తన, విమాన సంస్థల బ్యాన్ వంటి అంశాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఓ నియమావళిని కేంద్రం రూపొందించింది. సిబ్బందిని దూషిస్తే.. మూడు నెలల పాటు ఆ వ్యక్తిని విమానం ఎక్కనివ్వరు. భౌతిక దాడికి పాల్పడితే.. ఆరు నెలలు నిషేధం విధిస్తారు. చంపేస్తామంటూ బెదిరిస్తే.. కనీసం రెండేళ్ల నుంచి లైఫ్ టైం బ్యాన్ అమలు చేస్తారు. DGCA దగ్గర నమోదైన అన్ని సంస్థలతో పాటు.. విదేశీ ఎయిర్ లైన్స్ సైతం వీటిని పాటించాల్సి ఉంటుంది. ప్రపంచంలో తొలిసారిగా ఈ విధానం తీసుకొచ్చినట్టు మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com