హత్య కేసులో వ్యక్తి అరెస్ట్ ..మృతదేహం నూతిలోనికి విసిరివేత
- September 11, 2017
మస్కట్ : ఆసియా దేశానికి చెందిన ఓ నిందితుడు హత్య చేయడమే కాక మృతదేహాన్ని పాడుబడిన నూతిలోనికి విసిరివేశాడని రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ ఓ పి) వెల్లడించింది, హంతకుడు తన నేరంను కప్పిపుచ్చుకునేందుకు విలాయట్ లోని మహ్దా లో ఎవరూ ఉపయోగించని బావిలోనికి చనిపోయిన శవాన్ని పడవేసినట్లు ఒక ఆర్ ఓ పి అధికారి తెలిపారు. విచారణ మరియు నేర పరిశోధన విభాగానికి ప్రాతినిధ్యం వహించిన ఆల్ బరియామ్ పోలీసులు ఆ హత్య కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సెప్టెంబరు 3 వ తేదీన ఒక వ్యక్తి అదృశ్యం కావడం గురించి ఒక పిర్యాదు అందుకొన్న తర్వాత ఈ కేసుని పరిశోధించేందుకు ఒక బృందం ఏర్పడింది. ఈ నేరంతో సంబంధం ఉండవచ్చనే ఒక అనుమానంతో ఆసియా దేశానికి చెందన ఓ వ్యక్తిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నించడం జరిగిందని దాంతో ఆ అనుమానితుడు తానే ఆ హత్య చేసినట్లు అంగీకరించాడని రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు తేలిపారు.అనుమానితుడు హత్య చేసిన తర్వాత మృతదేహాన్నిబావి లోనికి తోసివేసినట్లు దర్యాప్తు బృందంకు తెలిపాడు. కాగా చనిపోయిన వ్యక్తి శరీరంపై కత్తులతో పొడిచినట్లు పలు గాయాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







