'మహానటి'లో కలక్షన్ కింగ్ మోహన్బాబుకి అవకాశం
- September 16, 2017
ఎంత పెద్ద డైలాగ్ అయినా ఏకధాటిగా చెప్పగల నటులు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా గుర్తొచ్చేది అలనాటి మహానటుడు ఎస్వీ రంగారావుగారు, ఎన్టీఆర్లు ముందువరసలో ఉంటారు. వారి తరువాత అంతటి పేరు సంపాదించుకున్న నటుడు కలక్షన్ కింగ్ మరియు డైలాగ్ కింగ్ అని పిలుచుకునే మోహన్ బాబు మాత్రమే. అందుకే మహానటి టీమ్ ఎస్వీరంగారావు పాత్రకోసం మోహన్ బాబుని ఎంపిక చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించగా, ఇంకా చాలా మంది ప్రముఖ నటీనటులే ఈ చిత్రంలో నటిస్తున్నారు. నిజానికి సావిత్రికి, ఎస్వీరంగారావుగారికి చాలా అనుబంధం ఉండేదట. ఆమహానటుడ్ని సావిత్రి నాన్నా అని ఆప్యాయంగా పిలుచుకునేదట. ఎస్వీకూడా సావిత్రిని కన్నకూతురిలాగే చూసేవారట. ఈ అనుబంధం తెరపై పండాలంటే మోహన్బాబు సరిగ్గా సరిపోతారని భావించినట్లుంది మహానటి టీమ్. అందుకే అంతటి మహా అవకాశాన్ని మోహన్బాబు కాదనకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్నుంచి మోహన్బాబు కూడా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. మెయిన్ కారెక్టర్స్ అందరూ మహామహులే ఉన్న ఈ 'మహానటి' సినిమా ప్రేక్షకులకు విందుభోజనం అందించబోతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







