వినియోగదారులు వారాంతాలలో అప్రమత్తంగా ఉండాలి: కతార్ ఎక్శ్ఛేంజ్ హౌస్ లు

- October 30, 2015 , by Maagulf
వినియోగదారులు వారాంతాలలో అప్రమత్తంగా ఉండాలి: కతార్ ఎక్శ్ఛేంజ్ హౌస్  లు

ప్రజలు, నడిరోడ్డుపై దోపిడీకీ గురౌతున్న సంఘటనలు ఇటీవల సంభవిస్తున్న నేపధ్యంలో, కతార్ లోని ఎక్శ్ఛేంజ్ హౌస్  లు తమ వినియోగదారులను తమ కార్యాలయాలను సందర్శించెప్పుడు,ముఖ్యంగా వారాంతాలలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగా నెల ప్రారంభంలో వేతనాలు అందుతాయి కనుక ఆ సమయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని; నాజ్మా లోని దుబాయి బాంక్ నుండి డబ్బు తీసుకుని బయటకు వస్తూండగా, దారిలో ఒక వ్యక్తి పొరబాటున అతని మీద ఉమ్మి వేసి, దానిని తొలగించినట్టు నటించి క్షమించమని అడుగుతూ  22,500 కతార్ రియల్స్ను దొంగిలించిన సంఘటన వార్తాపత్రికలలో వచ్చిన పాఠకులకు విదితమే. ఇంచుమించు ఇదే తరహాలో ఘటనలు అల్ ఘమ్మాన్, నాజ్మా లలో, అల్ ఘనిమ్ మరియు సౌక్ అల్ హరాజ్ ప్రాంతాలలో కూడా జరిగినట్టు తెలియవచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com