గల్ఫ్ ప్రాంతంలో ప్రజల కష్టాలను తొలగించడం అత్యవసరం : బహ్రైన్ యువరాజు
- October 31, 2015
11 వ మనామా డైలాగ్ కు విచ్చేసిన అతిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గల్ఫ్ ప్రాంతంలో ప్రజల కష్టాలను తొలగించడం మునుపెన్నడూ లేనంత ముఖ్యమైనదని, బహ్రైన్ యువరాజు హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ప్రకటించారు. దీర్ఘకాలిక స్థిరత్వం అనేది ఆశావాదం, అవకాశం మరియు శ్రేయస్సు అనే పునాదులపై నిర్మింపబడుతుందని, ఈ ప్రాంతంలోని ప్రతి సంస్కరణలో సహనం మరియు సహజీవనo ప్రతిబింబించాలని ఆయన నొక్కి చెప్పారు. సరిగ్గా ఈ విధానాలకు వ్యతిరేకమైన వాటినే అభివృద్ధికి వ్యతిరేకులైన తీవ్రవాదులు నమ్మి ఆచరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిరియా లోని పౌర యుద్ధం ఫలితంగా మిలియన్ల అమాయక ప్రజలు కష్టాలపాలయ్యారని అందరూ అంగీకరించక తప్పని నిజమని; ఈ సంవత్సరం రానున్న రెండురోజులు కొనసాగనున్న ఈ సమావేశంలో ఈ ప్రాంతం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యాత్మక అంశాలకు పరిష్కారాలను గురించి చర్చించి, తద్వారా శాంతిని నెలకొల్పే పరిష్కారాలను కనుగొనగలదని ఆయన అభిలషించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







