యూఏఈ లో అంగారక గ్రహ అనుభూతి .... 13.6 కోట్ల డాలర్ల వ్యయంతో నూతన నగరం
- September 30, 2017
యూఏఈ : పెట్రో డబ్బులు ...పెట్రేగిపోయేలా చేస్తుందేమో ? భూమి మీద కాపురముంటూ... అంగారకుడిపై నివసిస్తే ఎలా ఉంటుందో అనే అనుభూతి కోసం అరబ్బు షేకులు ఓ కొత్త నగరాన్ని నిర్మించబోతున్నారు. ‘మార్స్ సైంటిఫిక్ సిటీ’ పేరిట అద్భుతంగా కట్టబోతున్న ఈ ప్రాంతం అంగారకుడిని పోలిన వాతావరణంతో నిర్మాణమవుతోంది ఈ నగరం. మొత్తం విస్తీర్ణం 19 లక్షల చదరపు మీటర్లు. ఈ నగర నిర్మాణం కోసం అక్షరాలా 13.6 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఒక భారీ గోళాకారం వంటి నిర్మాణం లోపల ఉండే ఈ నగరంలో భవిష్యత్తులో అంగారకుడిపైకి చేరితే వ్యవసాయం ఎలా చేయాలి ? తాగు నీరు ..సాగు నీరు ఎలా సేకరించాలి అనే అంశాలన్నింటిపైనా క్షుణ్ణంగా పరిశోధనలు జరుగుతాయి. వాస్తవం ఏమిటంటే యూఏఈ ఇప్పటివరకూ ఓ సొంత ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించలేదు కానీ.. కానీ అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ఇంకో మూడేళ్లలోపున అంగారకుడిపైకి ‘హోప్‘ పేరుతో ఓ అంతరిక్ష నౌకను పంపనుంది. యూఏఈ దేశం ఏర్పడి 50 ఏళ్లు అయిన సందర్భంగా.. అంటే 2021 నుంచి ఈ నౌక మార్స్ చుట్టూ పరిభ్రమించడం మొదలుపెడుతుంది. అంతేకాకుండా ఇంకో వందేళ్లకైనా సరే.. అంగారకుడిపై తామే సొంతంగా నగరాన్ని కట్టుకోవాలన్న లక్ష్యంతో ఈ మార్స్ సైంటిఫిక్ సిటీ ప్రాజెక్టుకు ప్రారంభించింది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









