యూఏఈ లో అంగారక గ్రహ అనుభూతి .... 13.6 కోట్ల డాలర్ల వ్యయంతో నూతన నగరం
- September 30, 2017
యూఏఈ : పెట్రో డబ్బులు ...పెట్రేగిపోయేలా చేస్తుందేమో ? భూమి మీద కాపురముంటూ... అంగారకుడిపై నివసిస్తే ఎలా ఉంటుందో అనే అనుభూతి కోసం అరబ్బు షేకులు ఓ కొత్త నగరాన్ని నిర్మించబోతున్నారు. ‘మార్స్ సైంటిఫిక్ సిటీ’ పేరిట అద్భుతంగా కట్టబోతున్న ఈ ప్రాంతం అంగారకుడిని పోలిన వాతావరణంతో నిర్మాణమవుతోంది ఈ నగరం. మొత్తం విస్తీర్ణం 19 లక్షల చదరపు మీటర్లు. ఈ నగర నిర్మాణం కోసం అక్షరాలా 13.6 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఒక భారీ గోళాకారం వంటి నిర్మాణం లోపల ఉండే ఈ నగరంలో భవిష్యత్తులో అంగారకుడిపైకి చేరితే వ్యవసాయం ఎలా చేయాలి ? తాగు నీరు ..సాగు నీరు ఎలా సేకరించాలి అనే అంశాలన్నింటిపైనా క్షుణ్ణంగా పరిశోధనలు జరుగుతాయి. వాస్తవం ఏమిటంటే యూఏఈ ఇప్పటివరకూ ఓ సొంత ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించలేదు కానీ.. కానీ అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ఇంకో మూడేళ్లలోపున అంగారకుడిపైకి ‘హోప్‘ పేరుతో ఓ అంతరిక్ష నౌకను పంపనుంది. యూఏఈ దేశం ఏర్పడి 50 ఏళ్లు అయిన సందర్భంగా.. అంటే 2021 నుంచి ఈ నౌక మార్స్ చుట్టూ పరిభ్రమించడం మొదలుపెడుతుంది. అంతేకాకుండా ఇంకో వందేళ్లకైనా సరే.. అంగారకుడిపై తామే సొంతంగా నగరాన్ని కట్టుకోవాలన్న లక్ష్యంతో ఈ మార్స్ సైంటిఫిక్ సిటీ ప్రాజెక్టుకు ప్రారంభించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







