మహారాష్ట్ర ప్రభుత్వం లోకల్ ట్రైన్, ఒక్క రూపాయి క్లినిక్లో మహిళకు డెలివరి
- October 10, 2017
మహారాష్ట్ర ప్రభుత్వం లోకల్ ట్రైన్, మెట్రో రైల్వే స్టేషన్లలో ఒక్క రూపాయికే వైద్య సదుపాయలు అందించాలని క్లినిక్లను ప్రారంభించింది. రైలు స్టేషన్ వద్దకు చేరుకోగానే వైద్యులు రైల్లోకి వెళ్లి వైద్యం అందించడం వలన ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ క్లినిక్ను ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే అనూహ్య స్పందన వచ్చింది. గత రాత్రి దాదర్ స్టేషన్లో ఓ మహిళ పండండి బిడ్డకు జన్మనిచ్చింది. లోకల్ ట్రైన్లో వెళ్తున్న 26 ఏళ్ల సల్మా షేక్ 9 మాసాల గర్భిణీ. ఆమెకు ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన రైల్వే డాక్టర్ ప్రజ్వలిత్, తోటి ప్రయాణీకుల సాయంతో ఆమెకు కాన్పు చేశారు. డెలివరీ చేసిన వెంటనే తల్లీ బిడ్డలిద్దరినీ ఓ అంబులెన్స్ సాయంతో కేఈఎం ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. త్వరలో ఆర్టీసీ బస్టాండ్లలో కూడా వన్ రూపీ క్లినిక్లను ఓపెన్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







