జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసిన సిట్ అధికారులు
- October 14, 2017
జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కీలక పురోగతి సాధించింది. ఆమెను హత్య చేసిన ముగ్గురు నిందితులను గుర్తించింది. ఒక సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేసింది. ఆ దృశ్యాలను టీవీ 5 ఎక్స్ క్లూజివ్గా సంపాదించింది. ముగ్గురు నిందితుల ఊహా చిత్రాలు రూపొందించి విడుదల చేసింది. నిందితులను గుర్తించడంలో ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నిందితులను త్వరగా పట్టుకోవాలంటూ నిరసనలు వెల్లువెత్తుతుండడంతో సిట్ దీనిపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది.
సెప్టెంబర్ 5న కారులో ఇంటికొచ్చిన గౌరీ లంకేష్.. మెయిన్ గేటు తీస్తుండగా దుండగులు ఆమెపై దగ్గర్నుంచి కాల్పులు జరిపారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. అప్పటికే కాపుకాసిన దుండగులు.. కాల్పులు జరిపిన తర్వాత బైక్ పై పారిపోయారు. దుండగులు పక్కా రెక్కీ నిర్వహించే ఈ హత్య చేసినట్టు ఈ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది.
సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. హంతకుల ఆచూకీ తెలిపినవారికి పది లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. గౌరీ లంకేష్ హత్యను రాజకీయ పార్టీల నేతలు, మేధావులు ఖండించారు. గౌరీ లంకేష్ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనలకు దిగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







