కృష్ణకు ఇందిరాగాంధీ పురస్కారం
- October 14, 2017
న్యూఢిల్లీ: జాతీయ సమైక్యతకు పాటుపడిన వారికి అందజేసే ఇందిరాగాంధీ పురస్కారం ఈసారి (2015-16 సంవత్సరాలకు) కర్ణాటకకు చెందిన ప్రముఖ గాయకుడు టిఎం కృష్ణను వరించింది. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్థంతి రోజయిన ఈ నెల 31న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ అవార్డును కృష్ణకు బహూకరించనున్నారు. దేశంలో జాతీయ సమైక్యతను పరిరక్షించటంలో, పెంపొందించటంలో విశేష కృషి చేసిన టిఎం కృష్ణను 2015, 2016 సంవత్సరాలకు గాను 30వ ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఈ అవార్డు కమిటీ సభ్య కార్యదర్శి మోతీలాల్ వోరా శనివారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. సంస్కృతిలో సామాజిక ఐక్యతను సాధించినందుకు కృష్ణను గతంలో రామన్ మెగసెసే అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఇందిరాగాంధీ పురస్కారం కింద కృష్ణకు రూ. పది లక్షల నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నారు. కృష్ణ భారతీయ శాస్ర్తియ సంగీతంలోని కర్ణాటక సంప్రదాయంలో ప్రముఖ గాయకుడే కాకుండా పేరుమోసిన సామాజిక కార్యకర్త కూడా. కాలమిస్టు కూడా అయిన కృష్ణ అనేక సామాజిక-రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. వివిధ వేదికలపై ఉపన్యాసాలు ఇచ్చారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









